TTD Update | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను ఉద్దేశించి కీలక ప్రకటన జారీ చేసింది. సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబరు 7న చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తన్నట్లు తెలిపింది. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని మూసి, మరుసటి రోజు 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు జరిపే ఊర్జల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కాగా సెప్టెంబరు 7న మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల దర్శనాలను రద్దు చేసి, తిరిగి 8న సంప్రోక్షణల అనంతరం ఉదయం 6 గంటల తర్వాత దర్శనానికి అనుమతివ్వనున్నట్టు ప్రకటనలో తెలిపింది.










