Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఉప ఎన్నికలకు బీఆరెస్ సిద్ధం అవుతుంది’

‘ఉప ఎన్నికలకు బీఆరెస్ సిద్ధం అవుతుంది’

KTR News Latest | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని శాసనసభ స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని వెల్లడించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందని ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ మారిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు బీఆరెస్ పార్టీ సిద్ధం అవుతుందని, ఈ దిశగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో ‘పాంచ్ న్యాయ’ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాలు విసిరారు.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions