Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తనయుడు అకీరాతో కలిసి..పవన్ దక్షిణాది ఆలయాల పర్యటన

తనయుడు అకీరాతో కలిసి..పవన్ దక్షిణాది ఆలయాల పర్యటన

Pawan Kalyan’s Temple Tour | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) దక్షిణ భారత రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న విషయం తెల్సిందే.

షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మధురై లోని మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పవన్ సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శనివారం ఉదయం మధురై జిల్లాలోని అలగర్ కొండల్లో వల్లి, దేవసేన, గణపతి సమేతంగా నెలవై ఉన్న పలముదిర్చోలై, అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయం దర్శించుకుని, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

పవన్ దక్షిణాది ఆలయాల పర్యటనలో భాగంగా తనయుడు అకీరా నందన్ ( Akira Nandan ) తండ్రి వెంటే ఉంటున్నారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి కూడా డిప్యూటీ సీఎం వెంట ఉన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions