Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఘోర రైలు ప్రమాదం..ప్రయాణికుల పైనుండి వెళ్లిన రైలు

ఘోర రైలు ప్రమాదం..ప్రయాణికుల పైనుండి వెళ్లిన రైలు

Maharashtra Train Accident | మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జలగావ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు వ్యాపించినట్లు వదంతులు వచ్చాయి.

దింతో ప్రయాణికులు చైన్ లాగి పక్కనే ఉన్న పట్టాలపైకి దిగారు. పట్టాలు దాటుతున్న సమయంలో అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్ ప్రెస్ ప్రయాణికులపై నుండి దూసుకెళ్లింది.

ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఎనమిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కాగా మంటలు వ్యాపిస్తున్నట్లు వదంతులు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions