Cm Revanth Reddy Attend Chalo Rajbhavan Rally | తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అదాని ఆర్ధిక అవకతవకలపై మరియు మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టి కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ఈ అంశాలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ప్రదర్శనగా ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు బయలుదేరారు.
పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజ్ భవన్ ఎదుట బైఠాయించిన సీఎం రేవంత్ కేంద్రం, బీజేపీ వ్యతిరేకంగా నినదించారు.











