Cm Revanth On Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మునుపెన్నడూ లేని విదంగా వానాకాలంలో అత్యధికంగా 66.77 లక్షల ఎకరాల్లో వారి సాగాయినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘ కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా…
కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది. ఇది తెలంగాణ రైతుల ఘనత…వారి శ్రమ, చెమట, కష్టం ఫలితంతెలంగాణ రైతు దేశానికే గర్వకారణం…ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.’ అంటూ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.










