Elderly Woman Undergoes Brain Surgery While Listening to SPB Songs | విజయనగరం ( Vijayanagaram ) జిల్లా రాజాం ( Rajam )లోని జీఎంఆర్ కేర్ ఆసుపత్రిలో 65 ఏళ్ల వృద్దిరాలికి మత్తుమందు స్థానంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) పాటలు వినిపిస్తూ వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ ( Brain Surgery ) నిర్వహించారు.
పక్షవాతం లక్షణాలు కనిపించడంతో వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు.
అయితే ఆమెకు ముందుగా ఉన్న గుండె పరిస్థితి, ఆస్తమా ఉండడంతో జనరల్ అనేస్థీషియా ( Anesthesia ) ఇవ్వడం ప్రమాదకరమని గుర్తించారు. ఈ క్రమంలో అక్టోబర్ 4న వృద్దిరాలిని మెలకువగా ఉంచి సర్జరీని నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ సదరు రోగి సర్జరీ చేయించుకున్నారు.










