Thursday 18th June 2026
12:07:03 PM
Home > తాజా > ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో!  

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో!  

Metro

Hyderabad Metro Offers | హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైలులో సూపర్​ సేవర్​-59, స్టూడెంట్​ పాస్​, సూపర్​ సేవర్​ ఆఫ్​ పీక్​ అవర్​ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్​ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సూపర్ సేవర్ 59 (Super Saver 59) ద్వారా సెలవు రోజుల్లో కేవలం రూ.59 చెల్లించి అపరిమత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

ఇక విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్​ స్టూడెంట్​ పాస్​ ఆఫర్​ కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 9 నుంచి 11 గంటల మధ్య మెట్రో కార్డు ద్వారా ప్రయాణిస్తే వారికి కూడా 10 శాతం రాయితీని అందిస్తున్నారు. ఈ ఆఫర్ల గడువు సెప్టెంబర్ 29తో ముగిసింది. అయితే తాజాగా ఈ మూడు ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో తెలిపింది.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions