Thursday 19th March 2026
12:07:03 PM
Home > తాజా > ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో!  

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో!  

Metro

Hyderabad Metro Offers | హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైలులో సూపర్​ సేవర్​-59, స్టూడెంట్​ పాస్​, సూపర్​ సేవర్​ ఆఫ్​ పీక్​ అవర్​ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్​ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సూపర్ సేవర్ 59 (Super Saver 59) ద్వారా సెలవు రోజుల్లో కేవలం రూ.59 చెల్లించి అపరిమత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

ఇక విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్​ స్టూడెంట్​ పాస్​ ఆఫర్​ కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 9 నుంచి 11 గంటల మధ్య మెట్రో కార్డు ద్వారా ప్రయాణిస్తే వారికి కూడా 10 శాతం రాయితీని అందిస్తున్నారు. ఈ ఆఫర్ల గడువు సెప్టెంబర్ 29తో ముగిసింది. అయితే తాజాగా ఈ మూడు ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో తెలిపింది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions