Monday 17th March 2025
12:07:03 PM
Home > తాజా > ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో!  

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో!  

Metro

Hyderabad Metro Offers | హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైలులో సూపర్​ సేవర్​-59, స్టూడెంట్​ పాస్​, సూపర్​ సేవర్​ ఆఫ్​ పీక్​ అవర్​ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్​ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సూపర్ సేవర్ 59 (Super Saver 59) ద్వారా సెలవు రోజుల్లో కేవలం రూ.59 చెల్లించి అపరిమత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

ఇక విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్​ స్టూడెంట్​ పాస్​ ఆఫర్​ కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 9 నుంచి 11 గంటల మధ్య మెట్రో కార్డు ద్వారా ప్రయాణిస్తే వారికి కూడా 10 శాతం రాయితీని అందిస్తున్నారు. ఈ ఆఫర్ల గడువు సెప్టెంబర్ 29తో ముగిసింది. అయితే తాజాగా ఈ మూడు ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో తెలిపింది.

You may also like
amritha pranay
ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు!
PM Modi Takes Lion Safari
గిర్ అభయారణ్యంలో ప్రధాని.. కెమెరా చేతబట్టి..!
stalin
త్వరగా పిల్లల్ని కనండి.. కొత్త దంపతులకు సీఎం విజ్ఞప్తి!
pawan and vh
ఏపీ డిప్యూటీ సీఎంతో కాంగ్రెస్ సీనియర్ నేత భేటీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions