Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > వాళ్ల జోలికొస్తే జైలుకెళ్లడం ఖాయం.. ఎంపీ ఈటల వార్నింగ్!

వాళ్ల జోలికొస్తే జైలుకెళ్లడం ఖాయం.. ఎంపీ ఈటల వార్నింగ్!

Eatala Rajendar

MP Eatala Rajendar Warning | మల్కాజ్ గిరి (Malkajgiri Partliment) పార్లమెంట్ పరిధిలోని మూసీ (Moosi) పరివాహక ప్రాంతాలైన కొత్తపేట, సత్యా నగర్, ఫణిగిరి కాలనీ, జనప్రియ అపార్ట్‌మెం ట్స్ తదితర ప్రాంతాల్లో ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు.

మూసీ సుం దరీకరణ పేరిట ఇండ్లు కోల్పో తున్న వారితో సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.

ఉన్నతాధికారు ఆదేశాలు విని ప్రజలను, చట్టాలను పట్టించుకోకుండా పేదల ఇండ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయమని హెచ్చరించారు. పేదల జోలికి వస్తే తాను ఊరుకోనన్నారు.

ఎక్కడ కోర్టుకు వెళ్తామోనని దొంగల్లాగా శని, ఆదివారాల్లో ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చి వేస్తోందని మండిపడ్డారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని, పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వం అనుమతులతోనే అంతా ఇండ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు.

నేడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అం టూ ప్రభుత్వం ఆ నిర్మా ణాలను కూల్చి వేడయం దారుణమని అన్నా రు. అధికారం శాశ్వతం కాదనీ.. ప్రభుత్వం పేదలతో గోక్కో వద్దని హితవు పలికారు. హైడ్రా పేరిట జరుగుతున్న డ్రామాను ఆపాలని కేం ద్ర మం త్రి కిషన్‌రెడ్డి కూడా సీఎం రేవం త్‌రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు.  

You may also like
revanth reddy
‘హైదరాబాద్ చెరువులకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం’
hydraa saves rs 400 crores value government property
రూ. 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
bandi sanjay comments
పేదలకు ఒక న్యాయం.. అక్బరుద్దీన్ కుఒక న్యాయమా: బండి సంజయ్!
hydraa
ఆ తేదికి ముందు కట్టిన నిర్మాణాలను కూల్చబోం: రంగనాథ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions