Chiranjeevi Meets Cm Revanth | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy )ని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )సోమవారం కలిశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ( Telangana Floods ) తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి.
ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్ధం ప్రముఖులు విరాళం ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు తెలుగురాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అలాగే తనయుడు రామ్ చరణ్ ( Ram Charan )తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందజేశారు. మరోవైపు అమర్ రాజా గ్రూప్ ( Amar Raja Group ) తరఫున మాజీ ఎంపీ గల్లా అరుణ ( Galla Aruna ) సీఎంకు రూ. కోటి చెక్కును అందజేశారు.