Wednesday 18th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దారి వెంట పరదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

దారి వెంట పరదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

cbn press meet

CM Chandra Babu | ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu) దారి వెంట పరదాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, అనంతరం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుమలలో చంద్రబాబు వెళ్లే దారి వెంట అధికారులు పరదాలు కట్టారు.

ఈ క్రమంలో స్పందించిన సీఎం, తాను వెళ్లే దారి వెంట ఎటువంటి పరదాలు కట్టవద్దని, వెంటనే తొలగించాలని అదేశించారు. తనను ప్రజలకు దూరం చేసే ఎటువంటి చర్యలు చేపట్టొద్దని సీఎం చంద్రబాబు పోలీసులకు తెలిపారు.

ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలు మేరకు కట్టిన పరదాలను అధికారులు తొలగించారు. ఇదిలా ఉండగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దని, గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని విమర్శించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions