Friday 22nd August 2025
12:07:03 PM
Home > తాజా > సీఎం ను కలిసిన బీఆరెస్ ఎమ్మెల్యే.. చేరిక ఖాయమే(నా)!

సీఎం ను కలిసిన బీఆరెస్ ఎమ్మెల్యే.. చేరిక ఖాయమే(నా)!

brs mla prakash goud

BRS MLA Meets CM | రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) బీఆరెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. దీంతో త్వరలో కాంగ్రెస్ లో చేరుతానని ప్రకాష్ గౌడ్ సీఎం కు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

అనుచరులతో కలిసి మరో రెండు రోజుల్లో హస్తం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆరెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే.

ఇదిలా ఉండగా గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆరెస్ సమావేశంలో మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక సీనియర్ నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆరెస్ లోకి వస్తానని చెప్పినట్లు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్ బీఆరెస్ దే నని, 64 మంది ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బ్రతకనిస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా నేతలు పార్టీని వీడడం ఆసక్తిగా మారింది.

You may also like
hydraa saves rs 400 crores value government property
రూ. 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
online games
ఆన్ లైన్ మనీ గేమ్స్ ఇక నేరమే.. ఉల్లంఘిస్తే భారీగా శిక్షలు!
aishwarya rai
సోషల్ మీడియాపై ఐశ్వర్యారాయ్ సంచలన వ్యాఖ్యలు!  
justice sudershan reddy
ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions