Friday 18th October 2024
12:07:03 PM
Home > తాజా > నాకు ఆయన తోడున్నాడు: జితేందర్ రెడ్డి

నాకు ఆయన తోడున్నాడు: జితేందర్ రెడ్డి

Jithender Reddy News| మాజీ ఎంపీ, బీజేపీ ( Bjp ) నేత జితేందర్ రెడ్డి ( Jithender Reddy ) ఆసక్తికరమైన పోస్ట్ ( Post ) చేశారు.

పార్లమెంట్ ఎన్నికలకు గాను తెలంగాణలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది అధికార బీజేపీ. కానీ మహబూబ్నగర్ ( Mahabubnagar ) పార్లమెంట్ సీటును మాత్రం పెండింగ్ లో ఉంచారు.

ఇక్కడ నుండి పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి మరియు మాజీ మంత్రి డీకే అరుణ ( Dk Aruna ) లు పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు జితేందర్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనకు ఉన్నాయని, బీజేపీ కూడా మహబూబ్నగర్ టికెట్ తో తనను ఆశీర్వదిస్తుందని పేర్కొన్నారు.

టికెట్ విషయం పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు ఈ నేత. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు.

కాగా ఇటీవల ఎన్నికల ముందు వాట్ టు డూ ( What To Do ).. వాట్ నాట్ టు డూ ( What Not To Do ) అని ఆలోచిస్తున్నట్లు ఫన్నీ ట్వీట్ ( Funny Tweet )చేశారు.

You may also like
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్
పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్
జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ
అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions