Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > నాకు ఆయన తోడున్నాడు: జితేందర్ రెడ్డి

నాకు ఆయన తోడున్నాడు: జితేందర్ రెడ్డి

Jithender Reddy News| మాజీ ఎంపీ, బీజేపీ ( Bjp ) నేత జితేందర్ రెడ్డి ( Jithender Reddy ) ఆసక్తికరమైన పోస్ట్ ( Post ) చేశారు.

పార్లమెంట్ ఎన్నికలకు గాను తెలంగాణలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది అధికార బీజేపీ. కానీ మహబూబ్నగర్ ( Mahabubnagar ) పార్లమెంట్ సీటును మాత్రం పెండింగ్ లో ఉంచారు.

ఇక్కడ నుండి పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి మరియు మాజీ మంత్రి డీకే అరుణ ( Dk Aruna ) లు పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు జితేందర్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనకు ఉన్నాయని, బీజేపీ కూడా మహబూబ్నగర్ టికెట్ తో తనను ఆశీర్వదిస్తుందని పేర్కొన్నారు.

టికెట్ విషయం పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు ఈ నేత. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు.

కాగా ఇటీవల ఎన్నికల ముందు వాట్ టు డూ ( What To Do ).. వాట్ నాట్ టు డూ ( What Not To Do ) అని ఆలోచిస్తున్నట్లు ఫన్నీ ట్వీట్ ( Funny Tweet )చేశారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions