Friday 1st May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ అధినేత

ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ అధినేత

TDP chief to complain about vote irregularities

-సీఈసీని కలవనున్న చంద్రబాబు
-ఎల్లుండి ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు
-ఈ నెల 10న ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన సీఈసీకి చెందిన బృందం ఏపీకి రానుంది. ఈ నేపథ్యంలో వారు రాష్ట్రానికి రాకముందే సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు పార్టీ కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. వీరందరితో కలిసి చంద్రబాబు సీఈసీని కలవనున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions