Friday 17th April 2026
12:07:03 PM
Home > తాజా > ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

100% Tax Exemption For Electric Vehicles In Telangana | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు ( Electric Vehicles ) కొనుగోలు చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

రోడ్ ట్యాక్స్ ( Road Tax ), రిజిస్ట్రేషన్ చార్జీల ( Registration Charges ) నుండి 100 శాతం మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహన నూతన పాలసీకి సంబంధించి జీవో 41ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) ఆదివారం విడుదల చేశారు.

సోమవారం నుండి డిసెంబర్ 31 2026 వరకు ఈ పాలసీ ( Policy ) అమలు కానున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే ఈ గడువు పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు.

ట్యాక్స్ లు, చార్జీల మినహాయింపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100ల కోట్ల ఆదాయం కోల్పోతుందని, అయినప్పటికీ కాలుష్యం నుండి భవిష్యత్ తరాల్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రూపొందించినట్లు చెప్పారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
revanth reddy
‘హైదరాబాద్ చెరువులకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions