- అడవి శేష్ - సుప్రియ పెళ్లికి పచ్చ జెండా
- జూన్ లో మూహూర్తం ఫిక్స్!
Tollywood Love Couple | టాలీవుడ్ లో ఇప్పటివరకు అనేక ప్రేమజంటలు పెళ్లిళ్ల వరకు వెళ్లాయి. కొన్ని బంధాలు అన్యోన్యంగా కొనసాగుతుండగా.. మరికొన్ని మాత్రం కారణాలేమైనా అతి తక్కువ కాలంలోనే తెగిపోయాయి.
ఇదిలా ఉంటే, కొంతకాలంగా ఓ టాలీవుడ్ హీరో, ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న మాజీ హీరోయిన్ మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా ఇద్దరూ కలిసి ఓ ఇన్వెస్టిగేటివ్ మూవీలో నటించారు. తాజాగా వారి ప్రేమ విషయం పెళ్లి వరకు వెళ్లనున్నట్టు సమాచారం.
ఆ జంట ఇంకెవరో కాదండోయ్.. జేమ్స్ బాండ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అడవి శేష్, నాగార్జున మేనకోడలు సుప్రియ.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సుప్రియ సినీ ఎంట్రీ ఇచ్చింది.
Read Also: వరకట్నం తీసుకుంటారా.. అయితే మీ డిగ్రీపై ఆశలు వదులుకోవాల్సిందే!
ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆమె ఇటీవల కాలంలో గూఢాచారి సినిమాలో నటనతోనూ రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అడవి శేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి.
ఏకంగా డేటింగ్ చేస్తున్నారంటూ కూడా పుకార్లు చక్కర్లు కొట్టాయి. దానికి తోడు అక్కినేని కుటుంబంలో జరిగే ఫంక్షన్లలో శేష్ కనిపించడం, ఇద్దరూ కలిసి మీడియా కంట పడటంతో ఆ ఫొటోలు వైరల్గా మారాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుప్రియతో వివాహానికి శేష్ కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
దీంతో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. స్వయంగా అక్కినేని నాగార్జునే దగ్గరుండి ఈ వేడుకను జరిపించనున్నారట. జూన్ 16న శేష్-సుప్రియ వివాహం జరగున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.