Friday 1st May 2026
12:07:03 PM
Home > క్రీడలు > భారత్-A జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

భారత్-A జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Back As Captain | టీం ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను ఆస్ట్రేలియా-A తో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచుల కోసం భారత్-A జట్టు కెప్టెన్ గా నియమించింది.

ఇటీవల ప్రకటించిన ఆసియా కప్ జట్టులో శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో విమర్శలు వ్యక్తం అయ్యారు. ఇదే సమయంలో భారత్-A జట్టుకు శ్రేయస్ ను సారథిగా ఎంపిక చేయడం విశేషం. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-ఏ తో భారత జట్టుకు శ్రేయస్ సారథ్యం వహిస్తారు.

ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 16-19 మధ్య మరియు రెండవ మ్యాచ్ 23-26 మధ్య జరగనుంది. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ కు ఎంపికైన ధృవ్ జురెల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. సాయి సుదర్శన్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ సిరీస్ కు ఎంపికయ్యారు.

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా గాయపడ్డ నితీష్ కుమార్ రెడ్డి సైతం ఆస్ట్రేలియా-A తో జరగబోయే సిరీస్ లో పాల్గొంటారు. అలాగే తమిళనాడు కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ నారాయన్ జగదీశన్ కూడా అవకాశం అందుకున్నాడు. ఇకపోతే టీం ఇండియా సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ రెండవ మ్యాచుకు అందుబాటులో రానున్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions