Friday 3rd July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ..!

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ..!

ఆ ‘ఐదు సంకల్పాలు’ పాటించాలని భక్తులకు పిలుపు!

PM Modi Amarnath Yatra Letter | జమ్మూ కాశ్మీర్‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న పవిత్ర వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివ భక్తులకు ఒక ప్రత్యేక లేఖ రాశారు. ఈ యాత్ర చేస్తున్న భక్తులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

అమర్‌నాథ్ యాత్ర అనేది మన దేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో మరియు సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వత అధ్యాయంగా నిలిచిపోతుందని ప్రధాని తన లేఖలో కొనియాడారు.

పవిత్ర గుహలో హిమలింగ రూపంలో దర్శనమిచ్చే బాబా బర్ఫానీ దర్శనభాగ్యం.. లక్షలాది భక్తుల జీవితాల్లో అత్యంత శుభకరమైన, మరుపురాని అనుభూతిని మిగులుస్తుందని ఆయన పేర్కొన్నారు.

భక్తులు పాటించాల్సిన ‘ఐదు సంకల్పాలు’..

ఈ పవిత్ర యాత్రా సమయంలో శివ భక్తులందరూ ప్రధానంగా ఐదు సంకల్పాలను (5 Resolutions) తప్పక పాటించాలని ప్రధాని మోదీ కోరారు.

ఆ సంకల్పాలు ఇవే:

1. పరిశుభ్రత (Cleanliness): యాత్రా మార్గాన్ని ఎక్కడా చెత్తాచెదారం లేకుండా పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలి. పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాలి.

2. నిబంధనల పాలన (Following Rules): యాత్రికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం, అధికారులు సూచించే అన్ని భద్రతా మరియు పరిపాలనా మార్గదర్శకాలను కఠినంగా పాటించాలి.

3. స్థానిక ఆర్థిక వ్యవస్థకు దన్ను (Vocal for Local): స్థానిక ప్రజల ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచేందుకు, భక్తులు తమ మొత్తం ప్రయాణ ఖర్చులలో కనీసం 10 శాతం మొత్తాన్ని స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు మాత్రమే వెచ్చించాలి.

4. పర్యావరణ పరిరక్షణ (Green Initiative): పర్యావరణ పరిరక్షణలో భాగంగా, రాబోయే రక్షాబంధన్ (రాఖీ పూర్ణిమ) పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సోదరి లేదా సోదరుడికి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలి.

5. నేషన్ ఫస్ట్ (Nation First): ‘దేశమే ప్రథమం’ అనే స్పష్టమైన భావనతో ప్రతి పౌరుడు తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ, ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలి.

భద్రతా బలగాలకు ప్రధాని అభినందనలు..

ఈ పవిత్ర యాత్ర ద్వారా ప్రజల్లో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, మరియు సేవా భావం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతాయని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశం నలుమూలల నుంచి వస్తున్న శివ భక్తులందరికీ యాత్ర ఆద్యంతం భద్రత, శుభం కలగాలని బాబా బర్ఫానీని ఆయన ప్రార్థించారు.

అదేవిధంగా, అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ అహర్నిశలు భక్తుల సేవలో అంకితభావంతో పనిచేస్తున్న స్థానిక పోలీసులు, భారత సైన్యం, మరియు యాత్రా సిబ్బంది సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

You may also like
sharmila
ఈసారైనా కట్టేనా.. లేక మళ్లీ మట్టేనా: ప్రధాని పర్యటనపై షర్మిల కామెంట్స్!
Metro
HYDలో మోదీ రోడ్ షో.. రెండు స్టేషన్లు మూసివేస్తున్న మెట్రో!
pm modi serios
మణిపూర్ మహిళల ఊరేగింపు.. ప్రధాని మోదీ సీరియస్!
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions