Monday 19th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బొకేలు, శాలువాలు వద్దు.. పుస్తకాలుతీసుకురండి’: టీడీపీ ఎమ్మెల్యే

‘బొకేలు, శాలువాలు వద్దు.. పుస్తకాలుతీసుకురండి’: టీడీపీ ఎమ్మెల్యే

bandaru sravani sree

MLA Sravani Sree | ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శింగనమల ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి శ్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలవడానికి వచ్చే కార్యకర్తలకు, నాయకులకు కీలక సూచన చేశారు.

కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు, పూల దండలు, కేకులు కాకుండా చదువుకునే పిల్లలకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ మేరకు నియోజకవర్గంలో పోస్టర్లను పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రావణి శ్రీ, వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు పై 8 వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో గెలిచారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions