Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > క్షమాపణలు చెబుతున్నా..జర్నలిస్టును కలిసిన మోహన్ బాబు

క్షమాపణలు చెబుతున్నా..జర్నలిస్టును కలిసిన మోహన్ బాబు

Mohan Babu Meets Journalist Ranjith | నటుడు మోహన్ బాబు ( Mohan Babu ) జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు జర్నలిస్టును స్వయంగా కలిసి సారీ ( Sorry ) చెప్పారు.

హైదరాబాద్ జల్ పల్లి వద్ద గత మంగళవారం హైడ్రామా నెలకొన్న విషయం తెల్సిందే. మోహన్ బాబు నివాసానికి చేరుకున్న మంచు మనోజ్ ( Manchu Manoj ) ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. ఈ క్రమంలో మనోజ్ గేట్లను తీసుకుంటూ లోనికి వెళ్లారు.

ఇదే సమయంలో బయటకు వచ్చిన మోహన్ బాబు ఒక జర్నలిస్టుపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలపై మీ స్పందన ఏంటి అంటూ మోహన్ బాబుకు సదరు జర్నలిస్టు ప్రశ్నించగా, చేతిలోని మైకును లాక్కున్న మోహన్ బాబు దాడి చేశారు. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడా యశోద ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. అతని కుటుంబ సభ్యులను కలిసి ఉద్దేశ్యపూర్వకంగా కొట్టలేదని వివరణ ఇచ్చారు. మోహన్ బాబు వెంట మంచు విష్ణు ( Manchu Vishnu ) కూడా ఉన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions