Friday 1st May 2026
12:07:03 PM
Home > క్రైమ్ > కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Man commits suicide by pouring petrol in court premises

కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్కాంప్లెక్స్‌లో మంగళవారం మేకల పోశం అలియాస్‌ గ్యాస్ పోశం ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు.
కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్ కాంప్లెక్స్‌లో మంగళవారం మేకల పోశం అలియాస్‌ గ్యాస్ పోశం ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజీవ్ నగర్‌కు చెందిన పోశం, అదే కాలనికి చెందిన మహేష్‌కు గత కొంత కాలంగా పాత కక్షలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 3 న మహేష్, పోశంకు గొడవ జరిగింది. దీంతో మహేష్ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అయితే మంగళవారం మున్సిఫ్ కోర్టు ఆవరణలోకి వచ్చిన పోశం తన వెంట ప్లాస్టిక్ బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను తన ఒంటి పై పోసుకున్నాడు. నాకు న్యాయం కావాలి.
ఐ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలిస్తూ జేబులో ఉన్న అగ్గిపెట్టెను తీసే ప్రయత్నం చేయగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ కోర్ట్ కానిస్టేబుల్ పురుషోత్తం, వన్ టౌన్ కోర్ట్ కానిస్టేబుల్ అభి, కోర్ట్ హోమ్ గార్డు నాగేశ్వర్ రావు సమయస్పూర్తితో వ్యహరించి పోశంను కాపాడారు. వెంటనే అక్కడే ఉన్న న్యాయవాదులు, పోలీసులు హుటాహుటిన ప్రైవేట్ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions