Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ బోనాలు..నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ బోనాలు..నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

Hyderabad Bonalu 2025 | హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మరికొన్ని రోజుల్లో నెలకొననుంది. ఈ క్రమంలో జంట నగరాల్లో బోనాల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసింది.

ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 20 కోట్ల 2783 దేవాలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణకై చెక్కుల రూపంలో నిధులు జారీ చేయడం జరిగిందని వెల్లడించారు.

తెలంగాణ సంప్రదాయానికి, నిర్దిష్ట విధి విధానాల చట్రానికి అతీతంగా ఉండే మాతృదేవతారాధన, గ్రామీణ దేవతారాధన లోంచి పుట్టిన బోనాలు క్రమక్రమంగా సాంప్రదాయంగా ఏర్పడటం ఒక విశేషమన్నారు.

ఆషాడ మాసంలో ముందుగా నగరంలో గోల్గొండ బోనాలు జూన్ 29న, జూలై 1,2 తేదీలలో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జూలై 13,14 తేదీలలో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో, జూలై 20 న లాల్ దర్వాజా బోనాలు అలాగే జూలై 23 న చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు ఆ తర్వాత మిగిలిన దేవాలయాల బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions