Saturday 2nd May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !

అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !

Gautam Adani Charged By USA In Bribery Case | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పై అమెరికాలో కేసు నమోదవ్వడంతో అదానీ గ్రూప్ షేర్లు డమాల్ అయ్యాయి.

భారత్ లో ఓ భారీ సోలార్ ప్రాజెక్టు ( Solar Project ) దక్కించుకునేందుకు గౌతమ్ అదాని మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికాలోని ఎఫ్బీఐ ( FBI ) ఆరోపించింది.

కాంట్రాక్ట్ పొందేందుకు 265 మిలియన్ డాలర్లు అంటే రూ.2029 కోట్ల ఇవ్వడానికి ప్రయత్నించినట్లు అమెరికా బ్రుక్లిన్ లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. బ్యాంకులకు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు వస్తున్నాయి.

ఇందులో అమెరికన్ ఇన్వెస్టర్లు ( Investors ) కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో అదానీ పై కేసు నమోదయింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ( Newyork Eastern District ) అటార్నీ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగలతో గౌతమ్ అదాని తో సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో గురువారం మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లో అదాని గ్రూప్ షేర్లు ( Adani Group Shares ) భారీగా పతనమయ్యాయి.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions