Saturday 27th July 2024
12:07:03 PM
Home > తాజా > చిప్ప కూడు తిన్నా సిగ్గు రాలేదు..రేవంత్ పై కేసీఆర్ హాట్ కామెంట్స్!

చిప్ప కూడు తిన్నా సిగ్గు రాలేదు..రేవంత్ పై కేసీఆర్ హాట్ కామెంట్స్!

kcr news

KCR Fires On Revanth | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై నిప్పులు చెరిగారు బీఆరెస్ అధినేత కేసీఆర్.

బుధవారం కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలో బీఆరెస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ… రేవంత్ ఒక భూకబ్జా దారుడని ఆరోపించారు.

రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నారని, ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న సమయంలో రేవంత్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల వద్ద ఉన్న వ్యక్తి రేవంత్ అని, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ తీసుకొని వెళ్లిన వ్యక్తి టీపీసీసీ చీఫ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పటి టీఆరెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కుట్ర పన్నాడని, ఎమ్మెల్యే ను కొనుగోలు చేస్తూ రూ.50 లక్షల తో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ కన్నెర్ర చేశారు.

జైలులో చిప్ప కూడు తిన్న ఆయనకు సిగ్గు రాలేదని, నోరు తెరిస్తే గబ్బు అంటూ రేవంత్ లక్ష్యంగా మాటల తూటాలను వదిలారు గులాబీ అధిపతి.

You may also like
cm revanth
సీఎం రేవంత్ తో అందే శ్రీ, ఎంఎం కీరవాణి భేటీ.. కారణమిదేనా!
rahul gandhi
పెళ్లిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ktr
పిరమైన మోదీగారు.. విషం చిమ్మకండి: కేటీఆర్
kcr news
నీటి కొరతతో ఓయూ హాస్టల్ మూసివేత.. కేసీఆర్ ఫైర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions