Saturday 2nd May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జామ్ నగర్-ద్వారక..అనంత్ అంబానీ పాదయాత్ర

జామ్ నగర్-ద్వారక..అనంత్ అంబానీ పాదయాత్ర

Anant Ambani embarks on ‘Padyatra’ from Jamnagar to Dwarkadhish Temple | రిలయన్స్ అధినేత, ఆసియలోనే అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర చేపట్టారు.

గుజరాత్ జామ్ నగర్ నుండి ద్వారక వరకు సుమారు 140 కి.మీ. ఈ పాదయాత్ర కొనసాగనుంది. మార్చి 28న పాదయాత్ర ను ప్రారంభించిన అంబానీ రోజుకు 10కి.మీ. నుంచి 12 కి.మీ. వరకు నడుస్తున్నారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ 30వ పుట్టిన రోజును ద్వారకలో జరుపుకోనున్నారు.

తాను ఏ పని మొదలుపెట్టాలనుకున్నా మొదట ద్వారకాదీశుడిని ప్రార్థిస్తానని అనంత్ చెప్పారు. అనంత్ అంబానీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే వేసవి కావడంతో ఉదయం పూట విశ్రాంతి తీసుకుంటున్న అంబానీ రాత్రి వేళల్లో మాత్రమే నడుస్తున్నారు.

ఏప్రిల్ 1 వరకు ఐదు రోజులు దిగ్విజయంగా పాదయాత్ర చేపట్టినట్లు, ద్వారకను చేరుకోవడానికి మరో రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని అనంత్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా అనంత్ అంబానీకి ద్వారక శ్రీకృష్ణుడిపై అపార నమ్మకం.

ఈ నేపథ్యంలో యువత తాము సాధించే లక్ష్యాలను చేరుకోవాలంటే ద్వారకాదీశుడ్ని ప్రార్ధించాలని సూచించారు. కాగా గతేడాది అనంత్ అంబానీకి రాధిక మర్చంట్ తో వివాహం జరిగిన విషయం తెల్సిందే.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions