Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > సంధ్య థియేటర్ ఘటన..హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

సంధ్య థియేటర్ ఘటన..హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

allu arjun gets interim bail

Allu Arjun Files Petition In Telangana High Court | నటుడు అల్లు అర్జున్ హై కోర్టు ( High Court )ను ఆశ్రయించారు. డిసెంబర్ 5న అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన పుష్ప-2 ది రూల్ ( Pushpa-2 The Rule ) విడుదలైన విషయం తెల్సిందే.

అయితే డిసెంబర్ 4నే పలు థియేటర్లలో బెనిఫిట్ షోలను ప్రదర్శించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ ( Sandhya Theatre ) ను సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రేక్షకుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

దింతో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో బిఎన్ఎస్ ( BNS ) 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో యాజమాన్యం భద్రతపరమైన జాగ్రత్తలు తీసుకోలేదని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions