Actor Sonusood Meets Cm Chandrababu | నటుడు సోనూసూద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను అందించారు.
ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని నటుడు కలిశారు. అనంతరం అంబులెన్సులను ప్రభుత్వానికి అప్పగించారు. వీటిని సీఎం ప్రారంభించారు.
ఈ క్రమంలో సోనూసూద్ ను చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు సోనూసూద్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పారు.