Monday 27th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > డీప్‌ఫేక్స్, పరువు నష్టం పోస్టులపై బొంబాయి హైకోర్టుకు నితిన్ గడ్కరీ!

డీప్‌ఫేక్స్, పరువు నష్టం పోస్టులపై బొంబాయి హైకోర్టుకు నితిన్ గడ్కరీ!

nithin

Nitin Gadkari On Deepfakes | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై సోషల్ మీడియాలో వస్తున్న పరువు నష్టం కలిగించే పోస్టులు, డీప్‌ఫేక్స్ పై బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.

E20 ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ద్వారా ఆయన, ఆయన కుటుంబం లాభపడుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై మెటా మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై సివిల్ దావా వేసేందుకు జస్టిస్ అభయ్ అహుజా అనుమతి ఇచ్చారు. క్లాజ్ XII నిబంధన కింద ఈ దావా దాఖలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పెట్రోలియం శాఖ పరిధిలోని E20 కార్యక్రమంతో గడ్కరీకి వ్యక్తిగత లాభాలు ఉన్నాయంటూ ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు రెండు వారాల క్రితమే నాగ్‌పూర్‌లో పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్, ‘దేశీ బాయ్స్’ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్, హర్షిత్ రాఠీ, అంక్లేష్ ఇన్వతీలపై కేసు నమోదు చేశారు. 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల పాత వాహనాలకు నష్టం జరుగుతుందని ఇన్‌ఫ్లుయెన్సర్లు విమర్శలు చేయగా, ఇది పర్యావరణానికి సురక్షితమని కేంద్రం పునరుద్ఘాటించింది.

You may also like
supreme court
మతం మారితే SC హోదా రద్దు.. సుప్రీంకోర్టు సమర్థన!
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు!
పార్లమెంట్‌లో హైడ్రామా.. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎన్డీఏ ఘన స్వాగతం!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన కేంద్రం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions