Sunday 31st May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మావిగన్ పై జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు!

మావిగన్ పై జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు!

YS jagan
  • రూ. 2 లక్షల కోట్ల భారం తప్పించుకోవచ్చని వ్యాఖ్యలు!

YS Jagan Comments On MAVIGUN | ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి సరికొత్త మలుపు తిరిగింది. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో జరిగిన భేటీలో జగన్ మోహన్ రెడ్డి  ‘మావిగన్’ (MAVIGUN) కారిడార్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి పేరుతో ప్రభుత్వం రాష్ట్రంపై మోస్తున్న భారీ ఆర్థిక భారాన్ని తప్పించేందుకు ఇదే ఉత్తమ మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ సుమారు 110 కిలోమీటర్ల మేర నిర్మించే ఒక ‘క్యాపిటల్ కారిడార్’ నే జగన్ ‘మావిగన్’గా పేర్కొన్నారు.

  • MA – మచిలీపట్నం (Machilipatnam)
  • VI – విజయవాడ (Vijayawada)
  • GUN – గుంటూరు (Guntur)

“అమరావతి నిర్మాణానికి సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతాయి. అదే మావిగన్ కారిడార్‌లో అందులో 10 శాతం (రూ. 20 వేల కోట్లు) పెట్టుబడి పెడితే అద్భుతమైన మౌలిక వసతులు వస్తాయి. ఇప్పటికే అక్కడ నేషనల్ హైవేలు, ఎయిర్‌పోర్ట్, పోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి” అని జగన్ వివరించారు.

చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని కేవలం కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే వాడుకుంటోందని, అది ప్రజల రాజధాని కాదని ఆయన ధ్వజమెత్తారు.

ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఏపీ యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని, మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి ద్వారా ఆర్థికంగా రాష్ట్రం బలోపేతం అవుతుందని అంచనా వేశారు.

ఈ పేరు తన సొంత పేర్లకు (MA-JAGAN) దగ్గరగా ఉందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో, పేరు ముఖ్యం కాదని, ప్రాంతాభివృద్ధి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన తరుణంలో జగన్  మళ్ళీ ఈ ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తేవడంపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అమరావతి సంబరాలు మొదలైన నేపథ్యంలో జగన్ ఈ ‘మావిగన్’ ప్రతిపాదన ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions