Sunday 6th September 2026
12:07:03 PM
Home > తాజా > యూపీ సీఎంను కలిసిన బాలయ్య..యోగికి అఖండ త్రిశూలం

యూపీ సీఎంను కలిసిన బాలయ్య..యోగికి అఖండ త్రిశూలం

Balakrishna Meets CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా అఖండ త్రిశూలాన్ని సీఎంకు బహుకరించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘అఖండ-2 తాండవం’ డిసెంబర్ ఐదున విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆదివారం యూపీ సీఎం యోగిని కలిసింది అఖండ టీం. ఈ సందర్భంగా సినిమా కథను సీఎంకు వివరించారు బోయపాటి. అలాగే సినిమాలోని కొన్ని ప్రత్యేక సీన్లను సీఎం యోగికి చూపించారు. సనాతన ధర్మ గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించే సినిమాలు అవసరం అని యోగి నొక్కిచెప్పారు.

అఖండ-2 టీం గొప్పగా పనిచేసిందని, సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని ఆయన అభినందించారు. అనంతరం యోగికి అఖండ-2 లో కథానాయకుడు వినియోగించిన త్రిశూలాన్ని బహుకరించారు బాలయ్య. యోగితో భేటీ అద్భుతంగా జరిగినట్లు సంతోషం వ్యక్తం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions