Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కల్తీ మద్యం కేసు..టీడీపీ నేతలు సస్పెండ్

కల్తీ మద్యం కేసు..టీడీపీ నేతలు సస్పెండ్

TDP Suspends Local Leaders Over Fake Liquor Case | కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను అధినాయకత్వం సస్పెండ్ చేసింది. అన్నమయ్య జిల్లా ములకలచేరువులో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి అందులో కల్తీ మద్యం తయారు చేస్తూ సప్లై చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్వాహకులుగా పేర్కొంటూ టీడీపీ నాయకులు జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దర్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు ప్రకటించారు. కల్తీ మద్యం కేసులో ఇద్దరిపై విచారణ చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions