Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > గెలుపే లక్ష్యంగా తెలంగాణ వైపు బీజేపీ అధిష్టానం చూపు

గెలుపే లక్ష్యంగా తెలంగాణ వైపు బీజేపీ అధిష్టానం చూపు

Telangana BJP News | భారతీయ జనతా పార్టీ అధిష్టానం మిషన్ తెలంగాణను చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

ఆ వెంటనే సెప్టెంబర్ 10, 11 న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు నేతృత్వంలో రాష్ట్ర నాయకులతో ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకులు భేటీ కానున్నారు. దక్షిణాదిన తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తున్న తరుణంలో ఆ దిశగా అధిష్టానం పావులు కదిపేందుకు సిద్ధమయ్యింది.

ఓ వైపు రాష్ట్రంలోని బీఆరెస్ బలహీనపడుతుందని అలాగే అధికార కాంగ్రెస్ పై కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు బీజేపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ విస్తరణకు ఇదే సరైన సమయం అని భావిస్తుంది. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ, మరోవైపు కవిత అంశాన్ని అనుకూలంగా వాడుకుని గులాబీ పార్టీని వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అలాగే బీఆరెస్ లో ప్రజాబలం ఉన్న నాయకుల్ని చేర్చుకోవాలని చూస్తున్నట్లు కథనాల సారాంశం. ఇతర పార్టీల నుంచి నాయకులని చేర్చుకోవడమే కాకుండా వారితో సమన్వయానికి ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమయినట్లు సమాచారం.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’!
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions