Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు జమ!

రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు జమ!

acb telangana

Rythu Bharosa Scheme | తెలంగాణలోని రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట పెట్టుబడి కోసం అందించే రైతు భరోసా పథకం కింద ఆర్థిక సహాయం సోమవారం నుంచే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరి ఖాతాల్లో ఎకరానికి ఒక్క సీజన్‌కు రూ.6 వేల చొప్పున నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన రైతులందరికీ ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది.

ఈ మొత్తాన్ని ఖరీఫ్ (వానాకాలం) , రబీ (యాసంగి) సీజన్లకు గాను ఒక్కో విడతలో రూ.6,000 చొప్పున పంపిణీ చేస్తారు. ధరణి పోర్టల్‌లో నమోదైన భూమి కలిగిన పట్టాదారులు, అటవీ హక్కుల గుర్తింపు (RoFR) పట్టాదారులు కూడా ‘రైతు భరోసా’కు అర్హులు. ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
ponguleti srinivasa reddy
దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌!
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions