Putin dials Modi over Pahalgam attack | రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కి కాల్ చేశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు.
ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు మరణించడంపై పుతిన్ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటానికి పుతిన్ పూర్తి మద్దతు తెలిపారు. ఈ ఘాతుక దాడి చేసినవారు మరియు వారికి మద్దతు ఇచ్చినవారు తప్పకుండా శిక్షించబడాలని ఆయన నొక్కి చెప్పారు.
ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇరు నాయకులు మధ్య ప్రత్యేక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 80వ విక్టరీ డే సందర్భంగా పుతిన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ఏడాది చివరిలో భారతదేశంలో జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయనను ఆహ్వానించారు.