Sunday 2nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘పహల్గాం ఉగ్రదాడి..ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్’

‘పహల్గాం ఉగ్రదాడి..ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్’

Putin dials Modi over Pahalgam attack | రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కి కాల్ చేశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు.

ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు మరణించడంపై పుతిన్ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటానికి పుతిన్ పూర్తి మద్దతు తెలిపారు. ఈ ఘాతుక దాడి చేసినవారు మరియు వారికి మద్దతు ఇచ్చినవారు తప్పకుండా శిక్షించబడాలని ఆయన నొక్కి చెప్పారు.

ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇరు నాయకులు మధ్య ప్రత్యేక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 80వ విక్టరీ డే సందర్భంగా పుతిన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ఏడాది చివరిలో భారతదేశంలో జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయనను ఆహ్వానించారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions