Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > మోదీజీ కమలం కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు

మోదీజీ కమలం కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు

KTR Latest News | తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీ ( PM Modi )ని కలిసిన విషయం తెల్సిందే. నేతలంతా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు.

ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) స్పందించారు. మోదీ గారు మీ కమలం నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పనిచేస్తున్నారు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

‘చోటేభాయ్ కు వ్యూహకర్తగా…కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా..విశ్రమించకుండా పని చేస్తున్నారు!చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం ‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు! ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరు! రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు! హైడ్రా ( Hydra ) మంచిదంటారు, మూసి కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు! పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారు!
తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది!
జాగ్రత్తగా!
భద్రంగా!’ అంటూ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

You may also like
కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’!
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions