Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు

నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు

Road Accident: Humanity Is Forgotten | రక్తపుమడుగులో ఉన్న ఓ వ్యక్తి తనను కాపాడాలని వేడుకున్నా మనుషులు చలించలేదు. ఆఖరికి ఆయన ప్రాణం పోయింది.

మానవత్వానికే ఈ ఘటన ఓ మచ్చలా మిగిలిపోయింది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ కు చెందిన ఎలేందర్ హైదరాబాద్ లోని కీసర వద్ద రాంపల్లి చౌరస్తాలో నివసిస్తున్నారు. కొత్తగా కడుతున్న ఇల్లును చూసి వచ్చేందుకు స్కూటీపై బయలుదేరారు.

ఈ క్రమంలో వెనుక నుండి వచ్చిన లారీ ఎలెందర్ ను ఢీ కొట్టింది. దింతో స్థానికులు కేకలు వేశారు. వెంటనే లారీ డ్రైవర్ ఒక్కసారిగా రివర్స్ చేయడంతో ఎలెందర్ కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి.

తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడుతూ తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. కానీ అక్కడి వారు ఫోటోలు, వీడియోలు తీస్తూ గడిపేశారు. కొద్దిసేపటికి అంబులెన్సు వచ్చి ఆసుపత్రికి తరలించింది. అలస్యం కావడంతో సదరు వ్యక్తి మరణించారు.

హాస్పిటల్ కు తరలించడని వేడుకున్నా పోగైన జనం చోద్యం చూశారే తప్ప సహాయం చేయలేదు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions