Tuesday 3rd June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !

అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !

Gautam Adani Charged By USA In Bribery Case | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పై అమెరికాలో కేసు నమోదవ్వడంతో అదానీ గ్రూప్ షేర్లు డమాల్ అయ్యాయి.

భారత్ లో ఓ భారీ సోలార్ ప్రాజెక్టు ( Solar Project ) దక్కించుకునేందుకు గౌతమ్ అదాని మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికాలోని ఎఫ్బీఐ ( FBI ) ఆరోపించింది.

కాంట్రాక్ట్ పొందేందుకు 265 మిలియన్ డాలర్లు అంటే రూ.2029 కోట్ల ఇవ్వడానికి ప్రయత్నించినట్లు అమెరికా బ్రుక్లిన్ లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. బ్యాంకులకు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు వస్తున్నాయి.

ఇందులో అమెరికన్ ఇన్వెస్టర్లు ( Investors ) కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో అదానీ పై కేసు నమోదయింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ( Newyork Eastern District ) అటార్నీ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగలతో గౌతమ్ అదాని తో సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో గురువారం మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లో అదాని గ్రూప్ షేర్లు ( Adani Group Shares ) భారీగా పతనమయ్యాయి.

You may also like
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
og movie update
Pawan Kalyan OG సినిమాలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య కీలక పాత్ర!
gaddar film awards
గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions