Mutyalamma Vigraham | సికింద్రాబాద్ (Secunderabad)లోని ముత్యాలమ్మ (Mutyalamma Temple) ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. సోమవారం తెల్లవారుజామున మొండా మార్కెట్ (Monda Market) కుమ్మరిగూడ (Kummari Guda)లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు దుండగుల్లో ఒకర్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం వద్దకు భారీగా చేరుకుంటున్నాయి.
నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Minister Kishan Reddy),రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav)ఆలయం వద్దకు చేరుకున్నారు.
హిందు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మత కలహాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. అలాగే ఆలయ విగ్రహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.