Nampally Court Notices To Cm Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) అక్టోబర్ 16న విచారణకు హాజరవ్వాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.
కాగా ఓటుకు నోటు ( Cash For Vote ) కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మంగళవారం జరిగిన విచారణలో ముత్తయ్య సహా మిగిలిన నిందితులు గైర్హాజరు అయ్యారు.
విచారణకు హాజరు కాకపోవడం పై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న విచారణకు సీఎం రేవంత్ సహా నిందితులు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.