Monday 16th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 19 ఏళ్ల తర్వాత భారతీయ తండ్రినికలిసిన జపాన్ కుమారుడు!

19 ఏళ్ల తర్వాత భారతీయ తండ్రినికలిసిన జపాన్ కుమారుడు!

Japanese Son Reunites With Indian Father After 19 Years | భారత్ లో ఉన్న తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు జపాన్ ( Japan ) కు చెందిన ఓ కుమారుడు. 19 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత ఆ తండ్రీ కొడుకుల కలయిక అందరీ హృదయాలను హత్తుకుంది.

పంజాబ్ అమృత్ సర్ ( Amritsar ) కు చెందిన సుఖ్ పాల్ సింగ్ ( Sukhpal Singh ) థాయిలాండ్ ( Thailand ) దేశంలో సాచీ ( Sachie ) అనే జపనీస్ మహిళను 2002లో వివాహం చేసుకున్నారు. అనంతరం వారు జపాన్ రాజధాని టోక్యో ( Tokyo ) స్థిరపడ్డారు.

2003 వారికి రిన్ ( Rin ) అనే కుమారుడు జన్మించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత దంపతులు విడిపోయారు. ఆ తర్వాత సుఖ్ పాల్ సింగ్ స్వదేశానికి తిరిగొచ్చారు.

దీంతో కుమారుడు రిన్ తండ్రితో మరియు తండ్రి కుటుంబంతో పూర్తిగా సంబంధాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం రిన్ ఒసాకా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ ( Osaka University Of Arts ) లో చదువుతున్నాడు. ఈ సమయంలో వంశ వృక్షం ( Family Tree )అనే ప్రాజెక్టు రిన్ ను తండ్రిని కలిసేలా ప్రేరేపించింది.

అతికష్టం మీద రిన్ తన తండ్రి జాడను కనుగొన్నాడు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 18న పంజాబ్ లోని తన తండ్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి, కుమారుల కలయిక భావోద్వేగంగా సాగింది. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు.

You may also like
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
old tractor makes a man millionaire overnight
పనికి రాని పాత ట్రాక్టర్ రాత్రికి రాత్రేకోటీశ్వరుడిని చేసింది.. ఎలాగో తెలుసా!
bravery girl saves toddlers for faulty elevator
లిఫ్ట్ ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన బాలిక.. వీడియో వైరల్!
scrap dealer returns gold to costumer
బంగారాన్ని చెత్తతో కలిపి అమ్మేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!  

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions