Monday 3rd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బొకేలు, శాలువాలు వద్దు.. పుస్తకాలుతీసుకురండి’: టీడీపీ ఎమ్మెల్యే

‘బొకేలు, శాలువాలు వద్దు.. పుస్తకాలుతీసుకురండి’: టీడీపీ ఎమ్మెల్యే

bandaru sravani sree

MLA Sravani Sree | ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శింగనమల ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి శ్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలవడానికి వచ్చే కార్యకర్తలకు, నాయకులకు కీలక సూచన చేశారు.

కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు, పూల దండలు, కేకులు కాకుండా చదువుకునే పిల్లలకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ మేరకు నియోజకవర్గంలో పోస్టర్లను పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రావణి శ్రీ, వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు పై 8 వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో గెలిచారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions