Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సమ్మక్క-సారక్కల పరాక్రమాన్నిగుర్తుచేసుకుందాం: మోదీ

సమ్మక్క-సారక్కల పరాక్రమాన్నిగుర్తుచేసుకుందాం: మోదీ

modi

Modi Greetings On Medaram Festival | ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క ల జాతర బుధవారం నుండి ప్రారంభం అయ్యింది. దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరలో వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

బుధవారం నుండి మొదలుకొని, నాలుగు రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతర ప్రారంభం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.

” గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ  సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు.

ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం.” అని తెలిపారు మోదీ. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
seethakka
మేడారంలో హెలికాప్టర్ సేవలు.. టికెట్ ధర ఎంతంటే!
teena sravya
నాకు తెలియక చేశా క్షమించండి.. సారీ చెప్పిన హీరోయిన్!
cm revanth medaram visit
మేడారంలో వనదేవతల గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions