Ktr Responce On Defamation Notice| పీసీసీ ( PCC ) పదవికి రూ. 50 కోట్లు ( Rs. 50 Cr. ) అనే వ్యాఖ్యలు చేసినందుకు గానూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ( Working President ) కేటీఆర్ ( Ktr ) కు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ ( Incharge ) మాణికం ఠాకూర్ ( Manickam Tagore ) పరువు నష్టం నోటీసులు పంపారు.
ఈ నేపథ్యంలో తనకు వచ్చిన నోటీసుల ( Notice )పై స్పందించారు కేటీఆర్. ఎక్స్ ( Formerly Twitter ) వేదికగా స్పందించిన కేటీఆర్ మాణిక్కం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
“మాణికం ఠాకూర్ గారూ.. మీ తోటి కాంగ్రెస్ ( Congress ) నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkatreddy ) బహిరంగంగానే రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మీకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున మీడియా ( Media )లో వచ్చిన ఈ రూ. 50 కోట్ల లంచం ( Bribe ) వార్తలనే నేనూ ప్రస్తావించాను.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది. నా చిరునామా ( Address ) కు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి” అని పేర్కొన్నారు కేటీఆర్.










