Thursday 1st May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షల పందెం వేసా…ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షల పందెం వేసా…ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Balineni Srinivas Reddy News| సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ( YCP ) నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( Balineni Srinivas Reddy ).

ఈ మేరకు శనివారం ఒంగోలు ( Ongole ) లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ముప్పై ఏండ్ల నుండెజ్ రాజకీయాల్లో ఉన్నానని కానీ, ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే ఇర్రిటేషన్ ( Irritation ) వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఒంగోలు నుండే పోటీ చేస్తానని స్పష్టం చేసారాయన. కాగా తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ( Congress Party )గెలుస్తుందని, వేరే వ్యక్తితో రూ.50 లక్షలు పందెం కాసినట్లు వ్యాఖ్యానించారు.

కానీ తన కొడుకు తెలంగాణ జిల్లాలు తిరిగి, మళ్ళీ బీఆరెస్ ( Brs ) గెలవాలని, అలా అయితేనే ఏపీలో వైసీపీ గెలుస్తుందని తపన పడడంతో, అతని బాధ చూడలేక పందెం విరమించుకున్నట్లు పేర్కొన్నారు.

అలాగే తాను ఏమి నీతిమంతుండ్ని కాదని మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వైసీపీ నేత.

You may also like
tg ssc results
పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions