Monday 2nd March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షల పందెం వేసా…ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షల పందెం వేసా…ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Balineni Srinivas Reddy News| సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ( YCP ) నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( Balineni Srinivas Reddy ).

ఈ మేరకు శనివారం ఒంగోలు ( Ongole ) లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ముప్పై ఏండ్ల నుండెజ్ రాజకీయాల్లో ఉన్నానని కానీ, ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే ఇర్రిటేషన్ ( Irritation ) వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఒంగోలు నుండే పోటీ చేస్తానని స్పష్టం చేసారాయన. కాగా తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ( Congress Party )గెలుస్తుందని, వేరే వ్యక్తితో రూ.50 లక్షలు పందెం కాసినట్లు వ్యాఖ్యానించారు.

కానీ తన కొడుకు తెలంగాణ జిల్లాలు తిరిగి, మళ్ళీ బీఆరెస్ ( Brs ) గెలవాలని, అలా అయితేనే ఏపీలో వైసీపీ గెలుస్తుందని తపన పడడంతో, అతని బాధ చూడలేక పందెం విరమించుకున్నట్లు పేర్కొన్నారు.

అలాగే తాను ఏమి నీతిమంతుండ్ని కాదని మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వైసీపీ నేత.

You may also like
‘చెవుడు-మూగతనంతో చిన్నారులు బాధ పడకూడదు’
bandi sanjay
‘ఆ కుటుంబానికి రూ.1000 కోట్లుపంపేందుకే కేబినెట్ మీటింగా?’
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త.. హైకోర్టు కీలక తీర్పు!
no permission for organizations on my name, says ktr
నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions