Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > ముగిసిన సీఎల్పీ భేటీ.. మల్లిఖార్జున ఖర్గేకు కీలక బాధ్యతలు!|

ముగిసిన సీఎల్పీ భేటీ.. మల్లిఖార్జున ఖర్గేకు కీలక బాధ్యతలు!|

Telangana Congress CLP Meet| తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ( Assembly ) ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ( Congress Party ), సోమవారం ఉదయం హైదరాబాద్ ( Hyderabad ) లోని హోటల్ ఎల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ ( CLP ) సమావేశం జరిగింది.

సుమారు గంట పాటు సీఎల్పీ సమావేశం జరిగింది, అనంతరం మీడియా ( Media ) తో మాట్లాడిన కర్ణాటక ( Karnataka ) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( DK Shivakumar ) భేటీలో తీసుకున్న నిర్ణయాలను తెలిపారు.

మొదట కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ల అభిప్రాయం తీసుకొని, సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ( Mallikharjun Kharge ) కు అప్పగించినట్లు చెప్పారు.

సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.

అలాగే ఖర్గే నిర్ణయాన్ని శిరసావహించాలని తీర్మానించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ). ఈ తీర్మానాలను ప్రతిపాదించగా భట్టి, దామోదర, పొన్నం, కొండ సురేఖ, తుమ్మల, సీతక్క తదితరులు ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు.

కాగా సోమవారం సాయంత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

You may also like
‘ప్రభుత్వ విద్యార్థులకు 22 వస్తువులతో కూడిన కిట్’
cm revanth inaugurates olectra electric car
ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన సీఎం రేవంత్!
ముఖ్యమంత్రిగా ఇదే నా బ్రాండ్: సీఎం రేవంత్
tollywood meets cm revanth
సీఎం రేవంత్ తో సినీ పెద్దల భేటి.. ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions