Thursday 19th June 2025
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు నమోదు.. వేసింది ఎవరంటే..!

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు నమోదు.. వేసింది ఎవరంటే..!

telangana elections

Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి తొలి ఓటు నమోదయింది. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం.

పోలింగ్ బూత్ కు రాలేని వృద్ధులు, వికలాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ అనే సదుపాయాన్ని కల్పించింది. ఇందులో భాగంగా ఇంటి నుండి ఓటు ప్రక్రియ ప్రారంభం అయింది.

ఇందులో భాగంగా నవంబర్ 21న ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 91 ఏండ్ల అన్నపూర్ణ చండూరి తన ఇంటి వద్ద నుండే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికల అధికారులు, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. కాగా ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకోవడానికి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లో ఫారం 12-డిని ఉపయోగించి రిటర్నింగ్ అధికారి కి దరఖాస్తును సమర్పించారు.

మొత్తం 28 వేల 57 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుండి ఓటు హక్కు ను ఉపయోగించుకొనున్నారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు వేయడం ద్వారా అన్నపూర్ణ చండూరి వార్తల్లో నిలిచారు.

You may also like
‘కేసీఆర్, జగన్ కలిసి..నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినే’
acb telangana
రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు జమ!
tgsrtc
తెలంగాణ ఆర్టీసీ ఎన్ని కోట్ల ఉచిత టికెట్లు ఇచ్చిందో తెలుసా!
vivek venkata swamy
‘వివేక్ వెంకటస్వామి అనే నేను..’ మంత్రి గడ్డం వివేక్ ప్రస్థానమిదే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions