Friday 7th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వైఎస్ కుటంబంలో ఆస్తి వివాదాలు..షర్మిల, విజయమ్మ పై జగన్ పిటిషన్

వైఎస్ కుటంబంలో ఆస్తి వివాదాలు..షర్మిల, విజయమ్మ పై జగన్ పిటిషన్

Ys Jagan Petition On Sharmila And Vijayamma | మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ys Jagan ) తన తల్లి విజయమ్మ ( Vijayamma ), చెల్లి షర్మిల ( Sharmila ) పై పిటిషన్ దాఖలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే వైఎస్ కుటుంబం ( Ys Family )లో ఆస్తుల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తాయని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ( National Company Law Tribunal ) లో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ ( Saraswati Power And Industries Private Limited )లో వాటాల కేటాయింపుపై వివాదం నెలకొంది. దీంతో జగన్ మరియు భారతి NCLTను ఆశ్రయించారు. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వృద్ధిలో తమ పాత్ర కీలకంగా ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21న అవగాహన ఒప్పందం ( MOU )పై సంతకం చేశామని అయితే… వాటా కేటాయింపు ఇప్పటికీ ఖరారు కాలేదని పేర్కొన్నారు.

తన సోదరి వైఎస్ షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామని కానీ ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పిటిషన్‌లో తెలిపారు.

ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని.. తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని ఎన్‌సీఎల్‌టీని జగన్, భారతి అభ్యర్థించారు.


You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions