Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > స్వామి మాలలో దర్గాకు రాం చరణ్..ఉపాసన పోస్ట్ వైరల్

స్వామి మాలలో దర్గాకు రాం చరణ్..ఉపాసన పోస్ట్ వైరల్

Upasana Defends Ram Charan Dargah Visit | గ్లోబల్ స్టార్ రాంచరణ్ ( Global Star Ram Charan ) ఇటీవల కడప దర్గాకు వెళ్లిన విషయం తెల్సిందే.

అయ్యప్ప స్వామి మాలలో ఉన్న ఆయన కడప దర్గాలో నిర్వహించిన 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడం పట్ల పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రాం చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ( Upasana Konidela ) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘విశ్వాసం అనేది ఏకం చేస్తుంది. విడదీయదు. భారతీయులుగా, మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాము. మన బలం ఐక్యతలోనే ఉంది. #OneNationOneSpirit #jaihind
రామ్ చరణ్ ఎల్లప్పుడూ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తారు ‘ అంటూ ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions