Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > వరదల తక్షణ సహాయం.. ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల సాయం!

వరదల తక్షణ సహాయం.. ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల సాయం!

TG Floods

TG announces Flood Assistance | Telangana రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) . ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ (Command Control) సెంటర్ తో అనుసంధానం చేయాలన్నారు. ఈ సందర్భంగా వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలని చెప్పారు.

వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని, తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ రాయాలని పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.

ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల సాయాన్ని సీఎం ప్రకటించారు.

You may also like
CM Revanth's speech in the Madiga Employees Coordination Committee programme
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అది అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ: సీఎం
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
bandi sanjay
‘ఆ కుటుంబానికి రూ.1000 కోట్లుపంపేందుకే కేబినెట్ మీటింగా?’
cm revanth proposes ai ministry in india
‘ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions